![]() |
| Health Tips |
గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకుని పరగడుపున తాగితే శరీరంలోని మలినాలన్నీ వెలివేస్తాయి. ఇలా చేయడం వల్ల గుండెకు లాభం చేకూరుతుంది. గుండె ఆరోగ్యముగా, పటిష్టంగా ఉంచడంలో తేనె దివ్యౌషధంగా పనిచేస్తుంది. కాబట్టి ఇకనుంచైనా తేనె కలిపిన నిమ్మరసాన్ని రోజు తప్పనిసరిగా తాగడం అలవాటు చేసుకోండి. అలాగే వారంలో కనీసం రెండు, మూడు సార్లు అయిన హెర్బల్ "టీ" తాగాలి. ఎందుకంటే.. ఈ "టీ" లో కేఫినే ఉండదు కాబట్టి గుండెకు మేలు చేస్తుంది.
గుండెను పదిలం చేసుకోవాలంటే ద్రాక్షను తీసుకోండి. వీటిలో పాలీఫేనాల్స్ గుండెను రక్షిస్తుంది. అందులోనూ నల్ల ద్రాక్షలను తీసుకోవడం ద్వారా గుండెకు మేలు చేసినట్లవుతారు. ఇక యాలకుల పొడి వేసిన "టీ" తాగినా గుండె దడ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.అలాగే గుండె చుట్టూ కొవ్వు చేరకుండా నివారించడంలో వెల్లుల్లి భాగా పనిచేస్తుంది. అందుకే రోజు అర టేబుల్ స్పూన్ వెల్లుల్లి పొడిని తప్పనిసరిగా తీసుకోవాలి.
గుండెను పదిలం చేసుకోవాలంటే ద్రాక్షను తీసుకోండి. వీటిలో పాలీఫేనాల్స్ గుండెను రక్షిస్తుంది. అందులోనూ నల్ల ద్రాక్షలను తీసుకోవడం ద్వారా గుండెకు మేలు చేసినట్లవుతారు. ఇక యాలకుల పొడి వేసిన "టీ" తాగినా గుండె దడ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.అలాగే గుండె చుట్టూ కొవ్వు చేరకుండా నివారించడంలో వెల్లుల్లి భాగా పనిచేస్తుంది. అందుకే రోజు అర టేబుల్ స్పూన్ వెల్లుల్లి పొడిని తప్పనిసరిగా తీసుకోవాలి.
దీన్ని ఇష్టపడని వారు ఆహరంలో వెల్లుల్లి చేర్చుకుంటే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తేనె కంటికి అవసరమైన విటమిన్ శరీరం తీసుకునేందుకు సాయపడుతుంది. ఇది శరీరపు శక్తిని ఇనుమడింపజేస్తుంది. మానసిక ప్రశాంతతని, సహజమైన నిద్రని ఇస్తుంది. తేనె నీళ్ళు పుక్కిలిస్తే నోటి దుర్వాసన, చిగుళ్ళవాపు తగ్గుతాయి.
ప్రయోజనాలు:
* రోజూ పావు గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో రెండు చెమ్చాల తేనె కలుపుకుని తాగితే ఒళ్ళు తగ్గుతుంది.
* నిమ్మకాయరసంతో తేనె కలుపుకుని తీసుకుంటే కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గుతుంది.
* వేడి టీలో తేనె, నిమ్మరసం పది చుక్కలు వేసుకొని తాగితే ఆయాసం తగ్గుతుంది.
*ఎదిగే పిల్లలకు పాలు, ఎదిగిన పిల్లలకు నెయ్యి, ఎదిగి జీవించవలసిన మధ్య వయస్కులకు తేనె సహజమైన జీవరసాయనాలను అందిస్తుంది.
*తేనె, తులసి ఆకురసం కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. తేనెలో కొంచెం మిరియాలపొడి కలుపుకుని తీసుకుంటే జలుబు తగ్గిపోతుంది.
*రెండు చెమ్చాల తేనెలో కోడిగుడ్డులోని తెల్లని సొన, కొంచెం శనగపిండి కలుపుకుని ముఖానికి మర్దన చేసుకుంటే చర్మపుకాంతి పెరుగుతుంది.
ప్రయోజనాలు:
* రోజూ పావు గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో రెండు చెమ్చాల తేనె కలుపుకుని తాగితే ఒళ్ళు తగ్గుతుంది.
* నిమ్మకాయరసంతో తేనె కలుపుకుని తీసుకుంటే కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గుతుంది.
* వేడి టీలో తేనె, నిమ్మరసం పది చుక్కలు వేసుకొని తాగితే ఆయాసం తగ్గుతుంది.
*ఎదిగే పిల్లలకు పాలు, ఎదిగిన పిల్లలకు నెయ్యి, ఎదిగి జీవించవలసిన మధ్య వయస్కులకు తేనె సహజమైన జీవరసాయనాలను అందిస్తుంది.
*తేనె, తులసి ఆకురసం కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. తేనెలో కొంచెం మిరియాలపొడి కలుపుకుని తీసుకుంటే జలుబు తగ్గిపోతుంది.
*రెండు చెమ్చాల తేనెలో కోడిగుడ్డులోని తెల్లని సొన, కొంచెం శనగపిండి కలుపుకుని ముఖానికి మర్దన చేసుకుంటే చర్మపుకాంతి పెరుగుతుంది.

No comments:
Post a Comment